వైసిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

69చూసినవారు
వైసిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిసీసీ చైర్మన్ శోభ స్వాతిరాణి అన్నారు. ఎస్ కోట మండలం రేవళ్ళపాలెంలో ఆదివారం రాత్రి మండల పార్టీ అధ్యక్షులు కుమార్, జడ్పిటిసి వెంకటలక్ష్మి తదితర పార్టీ నాయకులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వివక్షత లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసిపి గెలుపుకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్