తోటి స్నేహితుడి కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన స్నేహితులు

78చూసినవారు
తోటి స్నేహితుడి కుటుంబానికి కొంతమంది స్నేహితులు ఆపదలో ఆపన్న హస్తం అందించి తమ స్నేహభావాన్ని చాటుకున్నారు. జామి మండలం కొట్యాడకు చెందిన కొమ్ము ప్రసాద్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న 1997- 98 ఎస్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన గౌరీపట్నం శ్రీను, డి రామారావు, పి శ్రీను, కె హేమంత్ ఆదివారం ప్రసాద్ కుటుంబానికి రూ. 28 వేలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇస్తూ భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్