ఎస్ కోట మండలంలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. కురిసిన వర్షానికి చెరువుల్లో నీరు చేరుతుందని రైతులు అంటున్నారు. అలాగే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వరి నారుమల్లును తయారు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. కాగా వర్షం కురిసే సమయంలో ప్రజలు సెల్ టవర్లు, చెట్లు కింద ఉండవద్దని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.