వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

70చూసినవారు
వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జామి ఎంఈఓ జయశ్రీ కోరారు. బుధవారం అలమండ ఎంపీపీ స్కూల్ ను ఆమె సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు రాధ, పైడింనాయుడు, సి ఆర్ పి సన్యాసయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్