రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి

79చూసినవారు
రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి
ఎస్ కోట మండలం వినాయకపల్లిలో గల ఊర చెరువు నుండి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే కల్వర్టుకు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు సోమవారం ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఈఓపిఆర్డికి వినతిపత్రం సమర్పించారు. కల్వర్టు, సాగునీరందించే కాలువపై ఆక్రమణలు జరగడంతో కల్వర్టుతో పాటు కాలువ పూడికతో నిండిపోయిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే కల్వర్టు ద్వారా ఆయకట్టు రైతులకు నీరందించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్