ఈవిఎంలను రాండమైజేషన్ చేసి అప్పగించిన దగ్గర నుండి పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి స్పష్టం చేసారు. ఈవిఎంలను భద్రపరచిన గదుల్లో 24/7 సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కల్లెక్టరేట్లో బుధవారం ఆర్. ఓలు, ఎఆర్ఓలు, సెక్టార్ అధికారులకు ఈవిఎంల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.