AP: విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో సీఐడీ విచారణకు సిద్ధమైంది.