TG: రాష్ట్రం ప్రభుత్వం తక్షణమే విద్యా శాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగింది. అలాగే బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.