మద్దతు ధర టన్నుకు 3500 చెల్లించాలి

76చూసినవారు
మద్దతు ధర టన్నుకు 3500 చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ప్రస్తుత సీజన్లో మద్దతు ధరను 3500 రూపాయలుగా చెల్లించాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని జనసేన పార్టీ కోరుతుంది. గురువారం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వీ ఎస్ నాయుడునీ చోడవరం నియోజవర్గ జనసేన ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందంకలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్