విద్యుత్ షాక్ తో రైతు మృతి

23602చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు. గ్రామ సమీపంలో గల పశువుల పాకలో రైతు రాచపతి నాగేశ్వరరావు (45) హోల్డర్కు బల్బ్ అమరుస్తుండగా విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్