గొడిచెర్ల లో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన

81చూసినవారు
గొడిచెర్ల లో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన
టీడీపీ-జనసేన, బీజేపీ కూటమితో ఏర్పాటయ్యే ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని, మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే 50ఏళ్లు వయసు నిండిన బీసీలందరికీ పెన్షన్ వస్తుందని చెప్పారు. మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలపై అవగాహన కల్పించారు. ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్