క్రికెట్ టోర్నమెంట్ విజేత నర్సీపట్నం కాళీ 11's టీం

4208చూసినవారు
క్రికెట్ టోర్నమెంట్ విజేత నర్సీపట్నం కాళీ 11's టీం
డి ఎర్రవరం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఎల్.వి.ఆర్ మెమోరియల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. దీనిలో మొత్తం 30 టీములు పాల్గొనగా, విజేతలుగా నర్సీపట్నం కాళీ 11's టీమ్ నిలిచారు. డి ఎర్రవరం టీమ్ రన్నర్స్ గా నిలిచారు. ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన లాలం విశ్వేశ్వరరావు విజేతలకు బహుమతులు అందజేస్తూ పలుమార్లు డి ఎర్రవరం సర్పంచ్ గా ఎన్నికై, ఊరికి ఎన్నో సేవలు అందించి తెలుగు దేశం పార్టీ తరుపున రాజకీయాలలో తనదైన ముద్రను వేసి కీర్తిశేషులు అయిన తన తండ్రి లాలం వెంకట రమణ జ్ఞాపకార్థం ఈ టోర్నీ ని ఏర్పాటు చేశామని తెలియచేశారు. విజేతలకు మొదటి బహుమతిగా 12, 000/- నగదు, షీల్డ్, మెడల్స్ మరియు రెండవ బహుమతిగా 6, 000/- నగదు, షీల్డ్, మెడల్స్ ని బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్