

గొలుగొండ: "అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు"
గొలుగొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బుధవారం ఎంపీపీ గజ్జలపు మణికుమరి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఎవరు ఉన్నా వారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. అనంతరం ఎంపీటీసీలు, సర్పంచ్ లు తమ పంచాయతీల్లో సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.