![](https://media.getlokalapp.com/cache/88/7a/887adaf85f99f64115c303a41db05b84.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నర్సీపట్నం మున్సిపాలిటీ జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు రత్నం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం ఉపాధ్యాయులు చప్పట్లు కొడుతూ వినూత్నంగా స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు పిల్లలతో మాట్లాడుతూ సెలవులు అనంతరం చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు. సిలబస్ సకాలంలో పూర్తి చేస్తామని విద్యార్థులు నిరంతరం పాఠశాలకు హాజరు కావాలని తెలిపారు.