మా కష్టాలు పట్టించు కోవడం లేదు

257చూసినవారు
మా కష్టాలు పట్టించు కోవడం లేదు
జి మాడుగుల మండలం, కుంబిడిసింగి గ్రామానికి వెల్లే రోడ్ ఎప్పట్నుంచో రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఇదే గెడ్డలో గత కొద్ది సంత్సరాల క్రితం దుర్ఘటన చోటు చేసుకుంది. పై ఫోటో చూస్తున్న విధంగానే గెడ్డ దాటుతున్నారు. ఈ కాల్వ దాటుతుండగా ముగ్గురు స్త్రీల నిండు ప్రాణాలు బలైపోయాయి. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి హామీలిచ్చారే తప్ప ఏ ఒక్కరూ రోడ్డు మార్గంలో బ్రిడ్జి నిర్మించలేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు మార్గంతో పాటు బ్రిడ్జి కూడా నిర్మించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్