విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసిన పిఓ

56చూసినవారు
విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసిన పిఓ
ఐటీడీఏ పీవో అభిషేక్ కొయ్యూరు మండల పర్యటనలో భాగంగా రావణాపల్లి, కొమ్మిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. విద్యార్థినుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. కొద్దిసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించటమే కాకుండా కొన్ని ప్రశ్నలకు సందేహాలను స్వయంగా నివృత్తి చేశారు. విద్యార్థులంతా బాగా చదువుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన ఉండాలన్నారు

సంబంధిత పోస్ట్