వృద్ధులు, నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన మదర్ హెల్ప్ ట్రస్ట్

160చూసినవారు
వృద్ధులు, నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన మదర్ హెల్ప్ ట్రస్ట్
అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతం అయినటువంటి రామన్నపాలెం గ్రామంలో మదర్ హెల్ఫ్ ట్రస్ట్ సభ్యులు పర్యటించి గ్రామంలో గల వృద్ధులకు మరియు పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒకరికి నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు అని పిలుపునిచ్చారు. ట్రస్ట్ సెక్రటరీ విజయ్ మాట్లాడుతూ గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము అని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ అచ్చిరాజు, గ్రామపెద్దలు లోవరాజు, చిన్ని కృష్ణా, దారబాబు మరియూ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వాడపల్లి సంజీవ్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మదర్ హెల్ప్ ట్రస్ట్ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్