ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్

762చూసినవారు
ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన "తులబరంగి" గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో గ్రామంలో సుమారు 50 మంది పాల్గొన్నారు. ఈ మీటింగ్ ను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు వారు కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. తరగతి ఉపాధ్యాయులు కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉందని చెప్పడం జరిగింది. పిల్లలను వేలకు బడికి పంపాలి, ఇంట్లో హోంవర్క్ చేయించాలి, పరిసరాలు శుభ్రంగా ఉండేటట్లుగా, గ్రామాని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని పిల్లల యొక్క తల్లితండ్రులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్