పాఠశాల భవనం మంజూరు చేయాలని వినతి

77చూసినవారు
జిమాడుగుల మండలంలోని సొలభం పంచాయతీలోని వై. కంఠవరంలో పాఠశాల భవనం మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 20 మంది విద్యార్థులకు శిధిలావస్థకు చేరిన పాఠశాల భవనంలోని బోధన కొనసాగుతుందని ఎప్పుడు భవనం కూలి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని ఆందోళన చెందుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నూతనపాఠశాల భవనం మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్