రానున్న ఎన్నికల్లో కూటమి నామరూపాలు లేకుండా కనుమరుగవడం ఖాయమని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఎండాడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ను ఒంటిరిగా ఎదర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై వస్తున్నాయని, ఒకే దెబ్బకు ఈ పార్టీలన్నీ కోమాలోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు.