చోడవరం: రైతు సంక్షేమ నిధి నుంచి 40 లక్షలు చెల్లింపు

61చూసినవారు
చోడవరం: రైతు సంక్షేమ నిధి నుంచి 40 లక్షలు చెల్లింపు
గోవాడ షుగర్స్ లో సభ్యు రైతులుగా ఉండి మరణించిన 141మంది రైతుల వారసులకు.. రైతు సంక్షేమ నిధి నుంచి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు చేతుల మీదుగా గోవాడ ఫ్యాక్టరీలో 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాజన సభలో ఇచ్చిన మాట ప్రకారం చెల్లింపులు ప్రారంభించారన్నారు. త్వరలో బకాయిలు చెల్లిస్తామన్నారు. ఎండి వీ. ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్