ప్రజా తీర్పును గౌరవిస్తా.. ప్రజల మధ్య ఉంటా

75చూసినవారు
తన ఊపిరి ఉన్నoత వరకు ప్రజా సేవే లక్ష్యంగా, నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారిగా గురువారం సాయంత్రం చోడవరం విచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పునుగౌరవిస్తూ ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవేలక్ష్యంగా పనిచేస్తానన్నారు. 15 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్