చందన అలంకరణలో లక్ష్మీ గణపతి

51చూసినవారు
చందన అలంకరణలో లక్ష్మీ గణపతి
చోడవరం మండలం పి ఎస్ పేట బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో రెండో రోజు ఆదివారం స్వామివారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఋషి పంచమి పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ తొమ్మిది రోజులు ఆలయంలో ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు దేవస్థానం అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్