విశాఖ ఎంపీ టికెట్‌పై అధిష్ఠానంతో బీజేపీ నేత‌ల మంత‌నాలు

7199చూసినవారు
విశాఖ ఎంపీ టికెట్‌పై అధిష్ఠానంతో బీజేపీ నేత‌ల మంత‌నాలు
విశాఖపట్నం ఎంపీ టికెట్‌పై అధిష్ఠానం పెద్దలతో ఏపీ బీజేపీ నేతల మంతనాలు జ‌రుపుతున్నారు. విశాఖపట్నం ఎంపీ స్థానం జీవీఎల్ నరసింహారావుకు కేటాయించాలని బీఎల్ సంతోష్‌ను బీజేపీ నేతలు కోరిన‌ట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానం టీడీపీ నేత భరత్‌కు కేటాయించిన విష‌యం తెలిసిందే. విశాఖ ఎంపీ స్థానం పునరాలోచించాలని విశాఖ బీజేపీ నాయ‌కులు కోరుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఎంపీ అభ్యర్థి మార్పుపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్