ప్లాంట్ పట్ల బిజెపి వైఖరి ఏమాత్రం మారలేదు

60చూసినవారు
ప్లాంట్ పట్ల బిజెపి వైఖరి ఏమాత్రం మారలేదు
విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరి ఏమాత్రం మారలేదని గాజువాకలోని 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు అన్నారు. ఆదివారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో కెబిఆర్ జంక్షన్ వద్ద "స్టీల్ ప్లాంట్ రక్షణకై"ధర్నా నిర్వహించారు. దీనిలో పెద్ద ఎత్తున కార్మికులు ప్రభుత్వ యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినదించారు. గంగారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ చర్యలతో ప్లాంట్ పరిస్థితిదిగజారుతొందని తీవ్రంగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్