ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

50చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ
విద్యార్థులు నోటు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సత్య సాయి వికాస్ సేవా సంస్థ ప్రతినిధి కాళ్ల శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం ఉచిత నోట్ పుస్తకాలను గ్రామ సర్పంచి అనిల్ కుమార్, ఎంపీటీసీ రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎం లక్ష్మి, ఇన్చార్జి హెచ్ఎం నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్