విశాఖలోని మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత అభ్యర్థిని మార్చి బండారును అక్కడి నుంచి పోటీలో నిలపాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మాడుగుల వెళ్లేందుకు అంగీకరించడంలేదు బండారు. పెందుర్తిలో అవమానించి.. మాడుగులలలో అవకాశంపై ఆసక్తి చూపడం లేదట.కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని బహిరంగ ప్రకటించారాయన. మరోవైపు హైకమాండ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు. ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తుంది రామానాయుడు వర్గం.