మాడుగుల.. అన్న సమారాధన కు విశేష స్పందన

64చూసినవారు
మాడుగుల.. అన్న సమారాధన కు విశేష స్పందన
దసరా నవరాత్రులు పురస్కరించుకొని మాడుగుల దుర్గలమ్మ వారి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 5000 మంది భక్తులు ఈ అన్నదానంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బి పరామేశ్వరరావు, జి పి సి ఇంఛార్జి నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్