బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేత

54చూసినవారు
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి బుధవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఆర్డీవో జయరాం బాధిత కుటుంబాలకు రూ. 5వేల నగదు, నిత్యవసర వస్తువులు రైసు బ్యాగు, కందిపప్పు, రాగి మాల్టు, మందులు తదితర వస్తువులను అందజేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారులందరు ఇంటికి వెళుతున్నారని పేర్కొన్నారు. 22 మంది విద్యార్థులకు గాను 20 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్