కారు ఢీ కొని బోల్తా పడ్డ ఆటో

21268చూసినవారు
పంజాబ్ హోటల్ జంక్షన్ జాతీయ రహదారిపై ఆదివారం పేను ప్రమాదం తప్పింది. ఈ మేరకు 53వ వార్డు పంజాబ్ హోటల్ జంక్షన్ జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ వద్ద రహదారిని అధిగమిస్తున్న ఆటోను ఆర్అండ్ బి జంక్షన్ నుండి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో ఆటో బోల్తాపడగా కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కారులో బెలూన్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్