కొయ్యూరు: స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

85చూసినవారు
కొయ్యూరు: స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
అల్లూరు జిల్లా కొయ్యూరు వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో బస్సులో 69 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ తెలిపారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న డౌనూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రభుదాస్ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అలాగే కారులో ప్రయాణిస్తు గాయపడిన దేవరపల్లికి చెందిన లక్ష్మీ ఆమె కుమారుడిని కారులో డౌనూరు పిహెచ్సి కి తరలించారు.

సంబంధిత పోస్ట్