వరద బాధితులకు సమకూర్చిన చీరలు, దుప్పట్లు

70చూసినవారు
వరద బాధితులకు సమకూర్చిన చీరలు, దుప్పట్లు
కోటవురట్ల టిడిపి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం 1000 దుప్పట్లు, చీరలు సమకూర్చారు. వీటిని వరద బాధితులకు పంపిణీ చేయడం కోసం గురువారం ఉదయం కోటవురట్ల మండల టిడిపి అధ్యక్షులు జానకి శ్రీను ఆధ్వర్యంలో వాహనంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి లింగన్నాయడు, ఎంపీటీసీలు పీవీ సూర్యారావు, ప్రకాష్, రాజపేట సర్పంచ్ రమణ టిడిపి నాయకుడు సుంకర బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్