రాజ‌శ్యామ‌ల హోమంలో పాల్గొన్న సీఎం

570చూసినవారు
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని, వ‌న దుర్గ అమ్మ వారిని ముఖ్య‌మంత్రి దర్శించుకున్నారు. అనంత‌రం శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జగ‌న్ పాల్గొన్నారు. అంత‌కు ముందు శారదా పీఠంలో సీఎం వైయ‌స్‌ జగన్‌కు సాదర స్వాగతం ల‌భించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్