కంటైనర్ లారీ బోల్తా ప్రమాదంలో తప్పిన పెను ప్రమాదం

73చూసినవారు
కంటైనర్ లారీ బోల్తా ప్రమాదంలో తప్పిన పెను ప్రమాదం
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ప్రధాన జంక్షన్ దగ్గర సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలోనే ఉన్న ఆటో పై కంటైనర్ పడిపోయింది. కంటైనర్ తాకిడికి ఆటో డ్యామేజ్ అయింది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడం పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద స్థలానికి పరవాడ పోలీసులు చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్