అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండలం లంకెల పాలెం లో ఉన్న నవదుర్గ శక్తిపీఠంకు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు ముత్యాల సతీష్ బాబు సహాయం అందజేశారు. ఈసందర్భంగా మంగళవారం అనకాపల్లి పట్టణం నర్సింగరావుపేట లో గల ఎం. వి. ఆర్ కార్యాలయంలో శక్తి పీఠం సభ్యులకు బియ్యం బస్తాలను విరాళంగా అందజేశారు. అనాధలకు, నిరుపేదలకు ఆహారాన్ని అందించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎం. వి. ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.