జనసేన తీర్ధం పుచ్చుకున్న వైసీపీ కార్యకర్తలు

589చూసినవారు
జనసేన తీర్ధం పుచ్చుకున్న వైసీపీ కార్యకర్తలు
పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. లంకెలపాలెం, రావాడ, గ్రామ పంచాయతీల్లో పర్యటించిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. లంకెలపాలెం జయ గ్రాండ్ హోటల్ లో సుందరపు శ్రీను, సర్వసిద్ధి సన్యాస రాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పంచకర్ల గెలుపునకు కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్