అడ్డతీగల మండలం వీఆర్ పురంలో రాంబాబుకి చెందిన పొగాకు అగ్నికి ఆహుతైంది. చేతికొచ్చిన పంటను తాటాకు పాకల్లో ఆరబెట్టగా ఇలా జరిగిందని బాధితుడు బుధవారం వాపోయాడు. ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల విలువచేసే పోగాకు దగ్ధమైందన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.