విశాఖ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పు నుంచి ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి వెంకట సాయి ముకుంద్, దక్షిణ నుంచి భారతీయ రాష్ట్రీయ దళ్ పార్టీ నేత దుర్గాప్రసాద్ వైకాపా నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి జె. బిపిన్ కుమార్ జైన్, ఉత్తర నుంచి నభ భారత నిర్మాణ సేవా పార్టీ నేత సూర్యం, సీపీఐ నుంచి విమల నామినేషన్ దాఖలు చేశారు.