జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణను ఒక్క అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని జెరాక్స్, వస్త్రవ్యాపారులు ఆకాంక్షించారు. ఈమేరకు గురువారం వంశీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు జనసేనలో చేరారు. వారందరికీ వంశీ కండువా కప్పి సదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు పిల్లివెంకట రమణ , మాజీ కార్పొరేటర్ పిల్లి వరలక్ష్మి, జనసేన సౌత్ సమన్వయకర్త శివప్రసాద్ పాల్గొన్నారు.