కేరళలోని వయనాడ్లో నిర్వహించిన రైతుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. ఈసారి ఎన్నికలు దేశంలో 2 పరివార్ ల మధ్య పోరాటమని అభిప్రాయపడ్డారు. ఒకటి మోదీ పరివార్ లో ED, EVMలు, CBI, అదానీ, అంబానీ ఉన్నారని తెలిపారు. ఇండియా పరివార్ లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారని అన్నారు.