కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బ‌తీసేందుకు కుట్ర: అతిషి

62చూసినవారు
కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బ‌తీసేందుకు కుట్ర: అతిషి
ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బ్ల‌డ్ షుగ‌ర్ పెరిగేందుకు స్వీట్లు, పండ్లు తింటున్నార‌ని ఈడీ పేర్కొన‌డం ప‌చ్చి అబ‌ద్ద‌మ‌ని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. షుగ‌ర్ లెవెల్‌ను నియంత్రించేందుకు కేజ్రీవాల్ రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటార‌ని, మ‌ధుమేహం అధికంగా ఉండేవారు ఇన్ని యూనిట్ల ఇన్సులిన్ త‌ప్ప‌క తీసుకోవాల‌ని చెప్పారు. బీజేపీ తన జేబు సంస్థ ఈడీ సాయంతో కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్