వ్యవస్థలను దుర్వినియోగం చేయడం మినహా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం. శ్రీభరత్ విమర్శించారు. గోపాలపట్నంలో పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గణబాబుకార్యాలయంలో సోమవారం నిర్వహించిన టిడిపి, జనసేన, బిజేపి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవస్థలను దుర్వినియెగం చేయడం ద్వారా ప్రశ్నించేవారిని భయభ్రాంతులకు గురిచేసారన్నారు.