జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారు: వెనిగండ్ల రాము

72చూసినవారు
జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారు: వెనిగండ్ల రాము
ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో రాము మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారని సెటైర్లు వేశారు. గుడివాడ రాజకీయాల్లో నిన్న జరిగిన సభ ప్రజలను కష్ట పెట్టే సభ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్