కార్యకర్తలను కాపాడుకుంటాం: కొడాలి నాని

59చూసినవారు
కార్యకర్తలను కాపాడుకుంటాం: కొడాలి నాని
టీడీపీ దాడులపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. శనివారం గుడివాడలో కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. దాడులతో వైసీపీ నేతలను భయపెట్టాలని అనుకుంటున్నారు. వైసీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తాం. దాడుల్లో గాయపడిన కార్యకర్తలను కాపాడుకుంటాం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్