తాడేపల్లిగూడెం పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో సామాన్యుడికి అండగా పట్టణవాసులు గురువారం నిరసన చేపట్టారు. శిథిలావస్థకు చేరిన ఇల్లు పడగొట్టి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేదని అధికారులు జేసీబీలతో పడగొట్టే ప్రయత్నం చేశారని ఆందోళనకు దిగారు. ఇల్లు నిర్మించుకోవాలంటే రూ. 5లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సామాన్యుడికి న్యాయం చేసే వరకు నిరసన కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు.