కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపూర్ మ్యూజియంలో మైనపు విగ్రహం

65చూసినవారు
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపూర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్ లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహ్లి విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఏడాదిగా పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి మ్యూజియంలో కోహ్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్