తణుకు పట్టణానికి చెందిన చిన్నారి లాస్యతేజ్ కార్తికేయ ఇటీవల నేపాల్ దేశంలో జరిగిన కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం తణుకులోని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసానికి విచ్చేసిన చిన్నారి లాస్యతేజ్ కార్తికేయ, తండ్రి పసుపులేటి భాస్కర్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. చిన్నారిని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.