ముంపునీరు త్వరితగతిన దిగువకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకువీడు మండలం దుంపగడపలో నీట మునిగిన వరిపొలాలను మంగళవారం డీఏవో వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఉప్పుటేరు బ్యాక్వాటర్ వల్ల వరి పొలాల్లోని నీరు బయటకు వెళ్ళడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు.