కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి

74చూసినవారు
కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి
ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ మంగళవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనగార్లంక, అయోధ్యలంక, కోడేరు, భీమలాపురం, పెదమల్లం లంక గ్రామాల్లో వరదల కారణంగా పశుగ్రాసం అందక ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు పశువుల దానా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతిగా ఉంటుందన్నారు. పంచాయతీ సిబ్బంది, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్