పరిశ్రమల ప్రోత్సాహానికి రూ. 3.07కోట్లు మంజూరు

52చూసినవారు
పరిశ్రమల ప్రోత్సాహానికి రూ. 3.07కోట్లు మంజూరు
ప. గో. జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు కింద రూ. 3.07కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప. గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు. సింగిల్ విండో పథకం కింద అనుమతులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు. ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్‌లో అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

సంబంధిత పోస్ట్