ప. గో.: జిల్లాలో 15 నుంచి గ్రామ సభలు ఏర్పాటు

64చూసినవారు
ప. గో.: జిల్లాలో 15 నుంచి గ్రామ సభలు ఏర్పాటు
ప. గో. జిల్లాలో రీసర్వే జరిగిన 174 గ్రామాల్లో ఈనెల 15 నుంచి 30 వరకు గ్రామసభలు నిర్వహించాలని జెసి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సిబ్బందికి మూడో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రేషన్‌ షాపుల ఏర్పాటుపై సూచనలిచ్చారు. కొత్తగా షాపులు ఏర్పాటుకు ఈనెల 12 లోపు ప్రతిపాదనలు పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్